L & T Company: ఇండియన్ మల్టీనేషనల్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లార్సన్ అండ్ టూబ్రోకి కొత్తగా అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ ఆర్డర్ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీ.. గుజరాత్లో దాదాపు 82 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో డిపోను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయితే ఇదే ఇండియాలో అతిపెద్ద డిపోగా నిలిచిపోనుంది.