కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్వర్ రెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై వివక్షత చూపుతుందని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వ్యవరించిందని చెప్పారు. breaking news,…
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం గణేష్ కు బాగా అలవాటు. ఒక పక్క రాజకీయాలకు తనకు సంబంధం లేదు అంటూనే రాజకీయపరంగా ట్వీట్స్ వేసి వివాదాలను రగిలిస్తాడు.
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.…
కేంద్రమంత్రి నితన్ గడ్కరీ నేడు తెలంగాణలో పలు నేషనల్ హైవే పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు. తన చేవెళ్ల పార్లమెంట్…
విభజన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్రెడ్డి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. అనంతర రంజిత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చర్చించామని తెలిపారు. 23 అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ తమకు ఒక బుక్లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం…
కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు…
లింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ శ్రీ.ఆరికేపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటరు రాగం నాగేందర్ యాదవ్ ఆయను మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలపై చర్చించారు. రైల్వే స్టేషన్ లాంజ్లో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా సమావేశంలో రంజిత్రెడ్డి మాట్లాడారు. లింగంపల్లి పురాతన రైల్వే అండర్ బ్రిడ్జితో ప్రజలకు చాలా…