వచ్చే వారం వివిధ భాషలకు చెందిన, మూడు విభిన్న కథా చిత్రాలు వెండితెరపై వెలుగులు విరజిమ్మబోతున్నాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న అంటే బుధవారం రాబోతోంది. ఆ రోజుకో ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే. దానికి ముందు వచ్చే బుధవారాన్ని క్రైస్తవులు ‘హోలీ వెడ్ నెస్’ గా భావిస్తారు. అందుకే తన ‘బీస్ట్’ చిత్రాన్ని శుక్రవారానికి రెండు రోజుల ముందే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విడుదల చేయబోతున్నాడు.…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని అభిమానుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న…
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ…
Hero Anand Devarakonda Birthday Special Tollywood New Movie Gam Gam Ganesha New Poster Released . సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలు చేశాడు. అదే ఊపులో మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.…
పోస్ట్ ప్యాండమిక్ తర్వాత బాలీవుడ్ నిదానంగా కుదురుకుంటోంది. భారీ కలెక్షన్లను వసూలు చేయలేకపోయినా, నిదానంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అలవాటు పడుతున్నారు. పలు రాష్ట్రాలలో యాభై శాతమే ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా ఈ కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయితే ప్యాండమిక్ తర్వాత విడుదలైన చిత్రాలలో రూ. 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న చిత్రాలలో నాలుగోదిగా అలియా భట్ ‘గంగూభాయి కఠియావాడి’ నిలిచింది. ఇప్పటికే ‘సూర్యవంశీ, పుష్ప (హిందీ), 83’ చిత్రాలు వంద కోట్ల గ్రాస్…
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తాజా చిత్రం ‘జల్సా’ ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి18న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్ను విడుదల చేస్తూ ‘కల్పితం కంటే నిజం వింతైనది!’ అంటూ ట్వీట్ చేసింది విద్యాబాలన్. ఇందులో మీడియా ఛానెల్కు ఎడిటర్గా నటిస్తోంది విద్యాబాలన్. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విద్యా రాజకీయ నాయకుల అకృత్యాలను బహిర్గతం చేసే పాత్రలో కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ప్రమాదానికి గురైన యువతి…
బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ వంద కోట్ల క్లబ్ లో ఎంటరైంది. త్వరలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ తొలి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఇండియా అలియా భట్ తో ఓ ఓటీటీ ఫిల్మ్ తీయనుంది. ఇందులో ‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గడోట్ కూడా నటించబోతోంది. ‘హార్ట్…
యంగ్ హీరోస్ శకం నడుస్తోంది. ఎంతోమంది తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన కిరణ్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గర్యయ్యాడు. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సెబాస్టియన్ పీసీ 524 . ఇందులో కిరణ్ సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న జనం ముందు నిలచింది. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.36.37 కోట్లు వసూలు చేసి విజయశంఖం పూరించింది. ఒక్క అమెరికాలోనే మొదటి రోజు మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీలో రూ.7.05 కోట్లు. ఇక ఇతర రాష్ట్రాలు, పరదేశాల్లో కలిపి రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. అంటే తెలుగు రాష్ట్రాలలో కాకుండానే మొత్తం రూ.9.95 కోట్లు కొల్లగొట్టింది.…