టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…
టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.…
ప్రియమణి, సన్నీలియోన్ తమ స్కేరీ లుక్స్తో భయపెడుతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ తీస్తున్న ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో ప్రియమణి, సన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్లో వారిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సారా అర్జున్ లుక్స్ కూడా రక్తపు మరకలతో భయానకంగా ఉండటం విశేషం. ఇందులో ప్రియమణి శకుంతలగా, సన్నీలియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, సారా ఇరాగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ…
భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్…
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్,…
ప్రముఖ నటుడు సూర్య, సుప్రసిద్ధ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్…
రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో అభిమానం వెల్లువెత్తింది. కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామపంచాయతీ లోని ఊరి నాయన పల్లి గ్రామంలో నందమూరి తారకరామారావు అభిమానులు ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా వారి గ్రామంలో కొత్తగా జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు బాబులకే బాబు …తారక్ బాబు కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు… అంటూ నినాదాలు చేశారు.…
Nadigar Sangam Meet CM MK Stalin. నడిగర్ సంఘం ఎన్నికల్లో రెండో సారి జయకేతనం ఎగురవేసింది పాండవర్ బృందం. 2019లో జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిపి, విజేతలను ప్రకటించారు. దాంతో కొత్తగా నడిగర్ సంఘానికి ఎన్నికైన అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తదితరులు మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఎన్నికల్లో స్టాలిన్ తనయుడు…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వలిమై’. ఫిబ్రవరి 24న విడుదలైన ఈ మూవీ తమిళనాడులో భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5లో ఈనెల 25 నుంచి వలిమై స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ5 సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. వలిమై సినిమాలో టాలీవుడ్…
మెగా పవర్ స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) మూవీ ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మితమైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. లేటెస్ట్గా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.…