Home
Monsoon
Monsoon News
-
PM Modi: కరెంట్ కోతలపై ప్రధాని మోడీ సమీక్ష
యూరప్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. వెంటనే వివిధ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండవేడి, వడగాలులు, వర్షాకాల సన్నద్ధత, కరెంట్ కోతలపై సమీక్ష నిర్వహించారు.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ఫలితంగా పెరిగిన విద్యుత్ డిమాండ్, బొగ్గు సరఫరాలో అంతరాలు, తదితర సంబంధిత అంశాలపై చర్చించారు. Read Also: Union minister Danve:… -
జోరువానలో తిరుమల.. భక్తుల ఆనందహేళ
అల్పపీడన ప్రభావం వల్ల తిరుమల తడిసి ముద్దయింది. కుండపోత వర్షంతో భక్తులు వణికిపోయారు. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. చలి గాలులు కూడా వీస్తుండడంతో భక్తులు బయటకు రావడానికి వెనుకాడారు. అనుకోని అతిథి రాకతో భక్తజనం ఉలిక్కిపడ్డారు. ఉరుములు, మెరుపులతో మధ్యాహ్నం వాన పడింది. తర్వాత 5 గంటల వరకు కుండపోతగా కురుస్తూనే వుంది.… -
ఆ ఫొటో రతన్ టాటాను కదిలించింది..
బిజీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు ఉన్నారు.. దీంట్లో ముందు వరుసలో ఉంటారు.. ఆనంద్ మహేంద్ర.. ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా విషయాలపై స్పందిస్తుంటారు.. ఇక, అప్పుడప్పుడు ఇతర పారిశ్రామికవేత్తలు కూడా సందర్భాన్ని బట్టి తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.. తాజాగా రతన్ టాటాను ఓ ఫొటో ఆకట్టుకుంది.. పెట్స్ అంటే ఎంతో ఇష్టపడే టాటా.. ఆ ఫొటోలోని సన్నివేశాన్ని చూసి స్పందించకుండా ఉండలేకపోయారు.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ ఫొటోను షేర్… -
అతడిని కోటీశ్వరుడిని చేసిన 157 చేపలు…
ఎవర్ని ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. నమ్ముకున్న వృత్తి వలన మొదట్లో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఎప్పుడోకప్పుడు అదే వృత్తి అతనికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వర్షాకాలం, పైగా సముద్రంలో అలజడి అధికంగా ఉండటంతో గత నెల రోజులుగా సముద్రంలో వేటకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల రోజుల తరువాత తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో చంద్రకాంత్ అనే మత్స్యకారుడు ముంబై-పాల్ఘర్ సముద్రంలో వేటకు వెళ్లాడు. పదిమందిని తీసుకొని వేటకు… -
హిమాచల్లో ప్రకృతి విలయం…213 మంది మృతి…భారీ నష్టం…
ప్రతి ఏడాది వర్షాకాలంలో హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి విలయాన్ని సృష్టిస్తుంటుంది. కొండచరియలు విరిగిపడటం అక్కడ కామన్. అయితే, ఈ వర్షాకాలంలో మరింత విలయాన్ని సృష్టించింది. ఈ విలయం దెబ్బకు 213 మంది మృతి చెందారు. రూ.600 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. భారీ వరదలకు 12 మంది కనిపించకుండా పోయినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది. ఇప్పటికీ ఇంకా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు… -
ముంబై అతలాకుతలం..
కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే… -
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ముంబైకి రెడ్ అలర్ట్..
మహారాష్ట్రలో తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణవాఖ.. నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందే రావడంతో ముంబైలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గడ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది… ఈ విషయాన్ని ఐఎండీ ముంబై… -
మరో 2, 3 రోజుల్లో నైరుతి రుతుపవనాల రాక.. 2 రోజులు వర్షాలు
మరో రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు.. నిన్న దక్షిణ కేరళలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కేరళా అంతటా మరియు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లో కొంత భాగంలోకి ప్రవేశించాయి… రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ జిల్లాలలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు తెలంగాణ నుండి… -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి… ముందుగా అంచనా వేసిన ప్రకారం జూన్ 1వ తేదీకి రెండు రోజులు ఆసల్యంగా కేరళలను తాకాయి రుతుపవనాలు.. ఇవాళ ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది.. ఈ నెల 1వ తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా.. రెండు రోజులు ఆలస్యంగా వచ్చినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు.. వీటి ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు చెప్పారు.. కాగా, గాలి వేగం, వర్షపాత స్థిరత్వం,… -
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం
నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతున్నట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, కేరళను మరికొన్ని గంటల్లో తొలకరి పలకరించనుంది.. ఈ నెల 3న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.. కాస్త ఆలస్యమైతే.. 4వ తేదీన కేరళలో ప్రవేశించే అవకాశం ఉందంటోంది ఐఎండీ.. కాగా, ముందుగా అంచనా వేసిన ప్రకారం… జూన్ 1న అంటే ఈరోజే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉంది.. కానీ, మందగమనం కారణంగా రెండు, మూడు…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!