హత్యాయత్నం కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్నటి నుంచి మోహన్ బాబు పోలీసులకు అందుబాటులో లేరని కాబట్టి ఆయన పరారీలో ఉన్నారని ఒకసారి లేదు అజ్ఞాతంలోకి వెళ్లారని మరోసారి వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.…
నిన్నటి నుంచి పరారీలో ఉన్నారంటూ, లేదు అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న మోహన్ బాబు ఎట్టకేలకు ట్వీట్ ద్వారా తాను పరారీలో లేనని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులకు సైతం మోహన్ బాబు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, కాబట్టి కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అలా కుదరదని విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్లుగా తెలుస్తోంది. సరే అంటూ పోలీసుల…
మంచు కుటుంబ వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుటుంబ వివాదం సమసింది అనుకునే సమయంలోపే ఒక మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ముఖానికి సర్జరీ చేయాల్సి రావడంతో పోలీసులు అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లను మార్చి హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లి ఈరోజు వరకు…
MLA Raja Singh : సీనియర్ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటనపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వారి కొడుకు మీడియాను ఆహ్వానించడం వలననే జర్నలిస్టులు హౌస్లోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు. KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్కు చెప్పండి.. రాహుల్ని కోరిన కేటీఆర్.. మీ కుటుంబ సమస్యలు మీ ఇంటి…
మీడియాపై మోహన్బాబు దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం ఎదుట మీడియా ప్రతినిధులు గుమికూడి ఉన్నారు. ఆ సమయంలో కొందరిని మనోజ్ తనకు సపోర్టుగా లోపలి రావాలని కోరాడు. ఆ క్రమంలో ఓ ఛానల్ ప్రతినిధి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేయగా ఛానల్ మైకు తీసుకుని మోహన్ బాబు దాడి చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఓ సెక్షన్ కింద కేసు నమోదు…
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమనట్టే అనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఘర్షణ వాతావరణంలో మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులను ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికిల్స్ అన్నింటినీ మంచు టౌన్ షిప్ బయటకు పంపిస్తున్నారు పోలీసులు. కాగా మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్…
మంచు కుటుంబంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు…
వినయ్ మోహన్బాబుకు మొదటి బిడ్డ లాంటి వారని.. తనకు అన్న లాంటి వారని మంచు విష్ణు తెలిపారు. ఆయన్ని ఎవ్వరూ కొట్టే అంత ధైర్యం చెయ్యరని స్పష్టం చేశారు. "మా నాన్న ప్రతిసారి చెబుతారు.. భారత దేశంలో ఐఐటీలను ఛాలెంజ్ చేసిన ఘనత మోహన్ బాబు యూనివర్సిటీ కి ఉంది.. మా యూనివర్సిటీ ఓపెన్ బుక్ లాంటిది.. మా యూనివర్సిటీలో 53 శాతం.. అమ్మాయిలు ఉన్నారు.. ఆయన క్రమశిక్షణ ని నమ్మి అమ్మాయిలను పేరెంట్స్ అక్కడ జాయిన్…
ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని మంచు విష్ణు అన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయన్నారు. "ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతాము.. నాకు ఇది చాలా పెయిన్ ఫుల్.. మేమెంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.. మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను.. మీకు కుటుంబాలు ఉన్నాయి... మీకు తండ్రులు ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి.. సెన్సేషన్…
MohanBabu : జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.