మంచు కుటుంబంలో మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ సినిమా రేంజ్ యక్ష్ణన్ ని తలపిస్తుంది. నిన్న మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మోహన్ బాబు విచారణకు రావాలని రాచకొండ పోలీసులు నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్ ని సవాలు చేస్తూ మోహన్ బాబు…
వినయ్ మోహన్బాబుకు మొదటి బిడ్డ లాంటి వారని.. తనకు అన్న లాంటి వారని మంచు విష్ణు తెలిపారు. ఆయన్ని ఎవ్వరూ కొట్టే అంత ధైర్యం చెయ్యరని స్పష్టం చేశారు. "మా నాన్న ప్రతిసారి చెబుతారు.. భారత దేశంలో ఐఐటీలను ఛాలెంజ్ చేసిన ఘనత మోహన్ బాబు యూనివర్సిటీ కి ఉంది.. మా యూనివర్సిటీ ఓపెన్ బుక్ లాంటిది.. మా యూనివర్సిటీలో 53 శాతం.. అమ్మాయిలు ఉన్నారు.. ఆయన క్రమశిక్షణ ని నమ్మి అమ్మాయిలను పేరెంట్స్ అక్కడ జాయిన్…
ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదని మంచు విష్ణు అన్నారు. మూడు తరాలుగా తమ కుటుంబం మీడియాతో సత్సంబంధాలు కలిగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇష్యూస్ ఉంటాయన్నారు. "ఎక్కువ మాట్లాడితే ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతాము.. నాకు ఇది చాలా పెయిన్ ఫుల్.. మేమెంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు.. మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నాను.. మీకు కుటుంబాలు ఉన్నాయి... మీకు తండ్రులు ఉన్నారు.. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి.. సెన్సేషన్…
MohanBabu : జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.
మనోజ్- మోహన్ బాబు గొడవలో వెలుగులోకి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చెన్నై లో ఉన్న ఓ టాయ్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు మౌనిక- మనోజ్ దంపతులు సిద్ధమయ్యారు. మనోజ్ కి వ్యాపారం చేయడం తెలియదని మోహన్ బాబు కంపెనీ కొనుగోలుకు నిరాకరించారు. ఇప్పటికే పలు వ్యసనాలకు అలవాటు పడ్డారని మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మౌనిక- మనోజ్ దంపతులను జల్పల్లి ఇంట్లోనే ఉండాలని చెప్పారు. వ్యాపారంతో పాటు రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచనలో…
మోహన్ బాబు జల్పల్లి నివాసం ముందు మీడియా ప్రతినిధుల ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ను లేవనెత్తారు. మోహన్ బాబు కుటుంబాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ ఆందోళనకు మంచు మనోజ్ మద్దతు తెలిపారు.మీడియా ప్రతినిధులతో కలిసి ఆందోళనలో కూర్చున్నారు.
మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు మోహన్బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు..
Manchu Manoj : మంచు మోహన్ బాబు, మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తండ్రీకొడుకులు బద్ద శత్రువులుగా మారారు. భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టే వరకు వెళ్లారు.
మోహన్బాబు ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన వెలువడింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాత్రి బీపీ పెరగడంతో పాటు.. కంటి కింద, కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం కార్డియోలజీ, జనరల్ ఫిజీసియన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం అనుమతి తరువాత మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు. అయితే ఇవ్వాళ రాచకొండ సీపీ యెదుట హాజరుకావాల్సి ఉండగా... మోహన్…
మంచు మనోజ్, మౌనిక జల్పల్లి నివాసంలోనే ఉన్నారు. ఉదయం 10:30 కి విచారణకు హాజరవ్వాలని మోహన్ బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ బాబు భార్య.. ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే ఆస్పత్రిలో విష్ణు ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం రాచకొండ సీపీ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గన్లు కూడా సరెండర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులు..…