CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలి
- ఈ ఏడాది 253 డ్రగ్స్ కేసుల నమోదు
- ఈ కేసుల్లో 521 మంది నిందితులను అరెస్ట్ చేశాం
- రూ.88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశాం
- ఈ ఏడాది 30 మందికి జీవిత ఖైదు విధింపు
- : రాచకొండ సీపీ సుధీర్బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా రూ. 88 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు సుధీర్ బాబు వెల్లడించారు. ఇంకా, 30 మందికి జీవిత ఖైదు విధించడం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ చలామణి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Kishan Reddy : రికమెండేషన్లకు తలొగ్గకుండా నియామక పత్రాలు
Also Read
ఇంకా, లోక్ అదాలత్ ద్వారా 11 వేలకుపైగా కేసులను పరిష్కరించినట్లు పేర్కొంటూ, ప్రజల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తుండటాన్ని ఆయన వివరించారు. అంతేకాకుండా.. మోహన్ బాబు ఘటనపై స్పందిస్తూ.. మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, మోహన్ బాబు వాళ్ళు టైం అడిగారు ఆ టైం తరువాత అవసరమైన చర్యలు చేపడతామన్నారు సీపీ సుధీర్ బాబు. అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని, బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్లైన్సును రూపొందిస్తామని, బౌన్సర్లు తోపులాటలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..