ఈ నెల 5న విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్-3' సరికొత్త రికార్డు సృష్టించింది. 'మీర్జాపూర్ సీజన్ 3'అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయబడుతోంది. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారం భారత్లో అమెజాన్ ప్రైమ్లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్గా నిలిచినట్లు ఓటీటీ సంస్థ వెల్లడించింది.