MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తమ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కు కొత్త వేరియంట్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్క్లూజివ్ ప్రో (Exclusive Pro) పేరిట ఈ వేరియంట్ను లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ. 17.24 లక్షలుగా నిర్ణయించారు. అయితే, బ్యాటరీ-ఎజ్-అ-సర్వీస్ (BaaS) ఆప్షన్ తీసుకుంటే, ధరను రూ. 12.24 లక్షల (ఎక్స్షోరూమ్)కు తగ్గించవచ్చు. BaaS స్కీమ్లో కిలోమీటరుకు రూ. 4.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త…
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,…
దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్సోర్’ ధరలను పెంచింది. విండ్సోర్ అన్ని వేరియంట్లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో…
MG Windsor EV Price in India: భారత ఆటో మార్కెట్లో ‘ఎంజీ విండ్సోర్ ఈవీ’ లాంచ్ అయింది. ఇది ఎంజీ నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే భారత మార్కెట్లో జెడ్ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను ఎంజీ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. విండ్సోర్ ఈవీ ధర రూ.9.99 లక్షల (ఎక్స్షోరూం) నుంచి మొదలవుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్లు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఇక అక్టోబర్ 12 నుండి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.…