సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య దూరాన్ని తగ్గించింది. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడమే కాకుండా… వారి పుట్టినరోజు, లేదా వాళ్ళ మూవీస్ కి సంబంధించి అప్డేట్ ఇలా ఏదైనా స్పెషల్ ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులు కూడా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. వారి హడావిడికి మరింత జోష్ పెరిగేలా తాజాగా…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో…
పౌరాణిక చిత్రాల దర్శకుడు గుణశేఖర్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా “చూడాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు గుణశేఖర్కు స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ను కూడా ఇచ్చింది. ఆ తరువాత గుణశేఖర్-చిరు కాంబినేషన్లో సినిమా రాలేదు. డైరెక్టర్ గుణశేఖర్ వరుసగా పౌరాణిక చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన భారీ పీరియాడిక్ మూవీ “శాకుంతలం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.…
అద్భుతమైన అమ్మాయి అంటూ ఓ చిన్నారిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అనే చేసిన పనికి మెగాస్టార్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఏం చేసిందనే కదా మీ డౌట్… అసలేం జరిగిందో స్వయంగా చిరంజీవే మాటల్లోనే… “పి.శ్రీనివాస్, శ్రీమతి హానీ గార్ల చిన్నారి కూతురు పేరు అన్షీ ప్రభల. జూన్ 1న తన బర్త్ డే.. తాను దాచుకున్న డబ్బులతో పాటు తన పుట్టినరోజుకు అయ్యే ఖర్చులను కూడా చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ మెగాస్టార్ ను తరచూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి గత ఏడాది మార్చి 25న ఉగాది శుభ దినాన ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ట్విట్టర్లో చేరిన రెండు రోజుల్లోనే మెగాస్టార్ ట్విట్టర్ ఖాతాను చాలామంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్…