ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా రాణించిన జెనీలియా రితీశ్ దేశ్ ముఖ్ తో పెళ్ళి తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. ఇటీవల కాలంలో జెనీలియా రీ ఎంట్రీ పై పలు వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. అయతే ఇప్పుడు జెనీలియా తన ఎంట్రీని భర్త రితీశ్ దేశ్ ముఖ్ దర్శకత్వంలోనే ఇవ్వనుంది.
‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాసినిగా నిలిచిపోయింది జెనీలియా.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. ఇక పిలల్లు పుట్టాకా ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం…