డిసెంబర్ నెలలో మహీంద్రా వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2024 నెలలో 69768 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులతో కలిపి 16% పెరుగుదల నమోదు చేసింది. మహీంద్రా దేశీయ మార్కెట్లో 41424 ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఇందులో 18% వృద్ధిని సాధించింది. 19502 వాహనాలకు విదేశాలకు ఎగుమతి చేసింది.