Lord Shiva: తవ్వకాల్లో బయటపడ్డ కళ్యాణి చాళుక్యుల నాటి శివుని ఆలయం..
- నాందేడ్లో బయటపడిన పురాతన శివుని ఆలయం
- కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదిగా నిర్ధారణ
- శాసనాల్లో కీలక విషయాలు
- ఆలయాలకు కేంద్రంగా హోట్టల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lord Shiva: మహారాష్ట్రలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. నాందేడ్ జిల్లాలోని హోట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. కళ్యాణి చాళుక్యుల నాటి ఆలయాలకు కేంద్రంగా ఉన్న హోట్టల్లో ఆలయంతో పాటు మూడు రాతి శాసనాలు లభించాయని అధికారులు వెల్లడించారు. క్రీ. శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతల విరాళాలు ఈ శాసనాల్లో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్న ఈ ప్రాంతం, అద్భుతమైన శిల్పాలకు, ఆలయాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
Read Also: Rahul Gandhi: వారణాసి నుంచి ప్రియాంకా పోటీ చేసి ఉంటే, మోడీ ఓడిపోయేవారు..
Also Read
- VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
ఈ చారిత్రాత్మక దేవాలయాలలో కొన్నింటిపై చేపడుతున్న పరిరక్షణ పనుల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్నప్పుడు పురావస్తు శాఖ అధికారులు ఆలయ స్థావరాన్ని కొనుగొన్నారు. నిర్మాణాన్ని నిర్ధారించేందుకు నాలుగు కందకాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగంతో కూడిని ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు వాడినట్లు రాష్ట్ర పురావస్తు శాఖ నాందేడ్ డివిజన్ ఇన్ఛార్జ్ అమోల్ గోటే తెలిపారు.
కళ్యాణి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు. తైలప-2 అనే రాష్ట్రకూట సామంత రాజు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించినట్లు తెలుస్తోంది. 200 ఏళ్లకు పైగా వీరు పాలన సాగించారు. వీరి నుంచే స్వాతంత్ర్యం పొంది కాకతీయులు వరంగల్ కేంద్రంగా పాలన సాగించారు. వీరు కర్ణాటక, మహారాష్ట్ర దక్షిణ భాగాన సామ్రాజ్యాన్ని విస్తరించారు.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. ఇది కదా కావాల్సింది!
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!