మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ఏకంగా 38 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’పై తమకు నమ్మకం లేదని.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమెటం జారీ చేశారు. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన 15 మంది…
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గౌహతి నుంచి శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గుజరాత్ వడోదర వేదిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాల నుంచి…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి కూటమి ‘ మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేనలో అసమ్మతి తలెత్తడం, ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఏకంగా 38 మంది ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్ధేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర రాజకీయంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశం మొత్తం మహా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీపై పట్టు కోల్పోకుండా అడుగులు వేస్తున్నారు. శివసేన పార్టీకి సంబంధించి మొత్తం 56 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే రెబెల్ గ్రూప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే వరసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు…
మహారాష్ట్రలో రాజకీయం సినిమాను తలపిస్తోంది. రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘ మహావికాస్ అఘాడీ’ కూటమి ప్రస్తుతం మైనారిటీలో పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే తో 37 మంది శివసేన ఎమ్మెల్యేలు అస్సాం గౌహతిలో క్యాంపు ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరో 7-8 మంది స్వతంత్ర ఎమ్యెల్యేలు ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో శివసేన ఇప్పుడు అధికారంతో పాటు పార్టీని కూడా…
బాల్ ఠాక్రే వేసిన పునాదుల్ని బిజెపి కదిలించగలదా?మరాఠా సెంటిమెంట్ని రాజకీయ వ్యూహాలు ఓడిస్తాయా?శివసేనకి మళ్లీ పుంజుకునేంత శక్తి ఉందా?మహా రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతున్నాయి? పదవిలో ఉన్న ముఖ్యమంత్రి సాక్షాత్తూ అధికారిక నివాసం వదిలి సొంత ఇంటికి వెళ్లిపోయాడు. కిడ్నాప్కు గురయ్యామంటా రెబల్ ఎమ్మెల్యేలు కొందరు వెనక్కి వచ్చారు. రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్యే అవతలి పక్షంలో చేరాడు. తిరుగుబాటు మానేసి దారికొస్తే, కూర్చుని మాట్లాడుకుందాం అని అధికార పక్షం ఆఫర్లు… వెరసి ప్రజాస్వామ్యమా ఇది లేక కేవలం…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.…
మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేసింది పోలీసు డిపార్ట్మెంట్... శివసైనికులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావొచ్చన్న సమాచారం పోలీసులకు చేరడంతో.. శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.