Maharashtra Municipal Election Results: మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM అనూహ్యంగా ప్రభావం చూపింది. ముఖ్యంగా మాలేగావ్లో ఒవైసీ పార్టీ కింగ్మేకర్గా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి ప్రతిపక్షాలను మట్టికరిపించింది. అయితే…
BMC Election Exit Polls: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి విజయం దాదాపు ఖరారైనట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన ఈ మున్సిపల్ సంస్థలో మొత్తం 227 వార్డులు ఉండగా, బీజేపీ–శివసేన కలిసి 130కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా. ఆక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ–శివసేన కూటమికి 131 నుంచి 151 సీట్లు రావొచ్చు. జేవీసీ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమి 138 వార్డులు…
BMC Elections Controversy: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో కొత్త లొల్లి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వేళ్లకు వేసిన సిరా చెరిగిపోతుందని వివాదం చెలరేగింది. వేళ్లకు చెరిపేయగల సిరా వేస్తున్నారని థాకరే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. READ ALSO: మహీంద్రా…
Maharashtra Municipal Politics: మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ సంస్థల్లో ఒకటిగా బీఎంసీకి పేరు ఉంది. అయితే ఈసారి ముంబయిని మించి, పెద్దగా ఎవరికీ తెలియని అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్సీపీ, శివసేన విభజన తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు ఎంత గందరగోళంగా మారాయో అంబర్నాథ్ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మంగళవారం జరిగిన పరిణామం రాజకీయ…
Maharashtra Local Body Elections: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలు చతికిలపడ్డాయి. మొత్తం 286 మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు ఈ రోజు (ఆదవారం) ప్రారంభైంది. రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి మధ్య ప్రత్యక్ష పోరాటం జరిగింది.