BMC Elections Controversy: మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంక్ వార్.. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMC Elections Controversy: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో కొత్త లొల్లి నెలకొంది. తాజాగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వేళ్లకు వేసిన సిరా చెరిగిపోతుందని వివాదం చెలరేగింది. వేళ్లకు చెరిపేయగల సిరా వేస్తున్నారని థాకరే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి.
READ ALSO: మహీంద్రా XUV 7XO డెలివరీలు స్టార్ట్.. ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే..?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని గురువారం శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేళ్లకు వేసిన చెరగని సిరాను నెయిల్ పాలిష్ రిమూవర్, శానిటైజర్తో సులభంగా తొలగిస్తున్నారని, దీనివల్ల కొంతమంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ పరిస్థితి పాలక మహాయుతి, రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ల “కుట్ర”కు నిదర్శనమని చెప్పారు.
ఇదే సమయంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన MNS చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. “గతంలో ఎన్నికల సమయంలో ఉపయోగించిన చెరిగిపోని సిరా స్థానాన్ని కొత్త పెన్నుతో భర్తీ చేస్తున్నారు. ఈ కొత్త పెన్ను గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. మీరు హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తే, ఈ సిరా తొలిగిపోతుందని చెప్పారు. అధికారంలో ఉండటానికి ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఇది చూపిస్తుంది. ఎవరైనా ఇలాంటి మోసం ద్వారా అధికారంలోకి వస్తే, మేము దానిని ఎన్నికలు అని పిలవము, ప్రజలు, శివసేన కార్యకర్తలు, మాతోశ్రీ సేన కార్యకర్తలు వీటన్నింటి గురించి జాగ్రత్తగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని చెప్పారు.
ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో “స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పోలింగ్” జరిగేలా చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. కొత్త పెన్నుకు బదులుగా చెరగని సిరాను ఉపయోగించారనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సంవత్సరాలుగా ఎన్నికల్లో ఒకే సిరాను ఉపయోగిస్తున్నారు”, అలాగే “నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా చూస్తున్నారు” అని షిండే తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను ఎన్నికల కమిషన్తో మాట్లాడాను. ఈ సిరాను చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నామని వారు నాకు చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా ఎటువంటి మోసపూరిత ఓటింగ్ జరగకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంది” అని వెల్లడించారు.
READ ALSO: Grok AI Controversy: గ్రోక్ను బికినీ ఫోటోలు అడుగుతున్నారా.. ముసుగేస్తుంది జాగ్రత్తా!
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!