బెజవాడలో కలకలం రేపిన రైల్వే లోకో పైలట్ హత్య కేసును ఛేదించారు పోలీసులు.. రెండు రోజుల క్రితం రైల్వే స్టేషన్ సమీపంలోనే లోకో పైలట్ ఏబేలు దారుణ హత్యకు గురవటం తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే.. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది.. అయితే, హత్యకు పాల్పడిన వ్యక్తిని సీసీ టీవీ ఫుటేజ్ లో పోలీసులు గుర్తించటంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు.