Home
Latest Telugu News
Latest Telugu News News
-
కరోనా కాలం.. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య
తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జ్వరం, జలుబు, గొంతునొప్పి వంటి లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారని తెలిసింది. ఇప్పటివరకు 29.26 లక్షల ఇళ్లను సర్వే చేయగా ఇందులో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారు 1,28,079 మంది ఉన్నారు. వీరిలో 1,27,372 మందికి మెడికల్ కిట్లను ఆరోగ్య సిబ్బంది పంపిణీ చేశారు. చాలా మందిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా… -
ఫిబ్రవరి 22 నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
✪ పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేడు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు… పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం✪ తెలంగాణలో నేడు రెండో రోజు ఇంటింటి ఫీవర్ సర్వే… సర్వేలో పెద్దల, చిన్నారుల ఆరోగ్య వివరాల సేకరణ.. మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫీవర్ సర్వే✪ నేడు రెండో రోజు తెలంగాణ సీపీఎం రాష్ట్ర మహాసభలు.. ఈనెల 25 వరకు కొనసాగనున్న సమావేశాలు✪ కేప్టౌన్: నేడు… -
టీమిండియా-వెస్టిండీస్ సిరీస్కు వేదికలు ఖరారు
దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్లో వన్డేలు, టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. అయితే భారత్లో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్లు జరిగే వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను… -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈనెల 31 వరకు ఆంక్షలు పొడిగింపు
దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ ర్యాలీలు, రోడ్ షోలపై గతంలో నిషేధం విధించింది. తాజా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత బహిరంగ సభలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రెండో దశ… -
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే… భువీ ఔట్, కోహ్లీ డౌట్
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా… ఆదివారం జరిగే నామమాత్రపు మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానంలో వేరేవాళ్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్పై వేటు వేసి.. అతడి స్థానంలో… -
కరోనా ఎఫెక్ట్… 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే… -
టీమిండియాకు చావో.. రేవో..!! రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్
పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగుతోంది. ఆల్రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది. తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్స్మెన్ భారీ స్కోరు చేయాల్సి ఉంది. జట్ల వివరాలుభారత్:… -
విజయసాయిరెడ్డి-రఘురామ ట్వీట్ వార్.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం
ఢిల్లీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం రఘురామకృష్ణంరాజు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు… -
ఐదేళ్ల లోపు చిన్నారులకు మాస్క్ అక్కర్లేదు.. కేంద్రం కొత్త గైడ్లైన్స్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మాస్కులు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతి…
తాజావార్తలు
-
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
-
Chicken Samosa: సమోసా ప్రియులకు పండగే.. బండి మీద రుచితో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
-
GT vs MI: సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
-
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
-
2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?