అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు…
✪ నేడు మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్న రాజకీయ పార్టీలు✪ నేడు శ్రీకాకుళం శాంతినగర్లో గాంధీ స్మారక మందిరం ప్రారంభం… గాంధీ మందిరంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తివనం ప్రారంభం✪ హైదరాబాద్: ప్రగతిభవన్లో నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్✪ హైదరాబాద్: నేడు డ్రగ్స్ కేసులో రెండో రోజు టోనీని విచారించనున్న పోలీసులు✪ ఢిల్లీ: నేడు లోక్సభ స్పీకర్…
ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని…
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 2017లోనే ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసస్ను 200 కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి ఈ…
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని…
తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Read Also: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు రీ…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. Read Also: రైల్వే శాఖ కీలక నిర్ణయం: నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన…
ఐపీఎల్-15 సీజన్కు సమయం దగ్గర పడుతోంది. మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్లోనే ఈ మెగా టోర్నీని నిర్వహిస్తామని బీసీసీఐ చెప్తున్నా.. కరోనా కేసుల నేపథ్యంలో దక్షిణాఫ్రికా లేదా దుబాయ్లో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ మ్యాచ్లకు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లను వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో లేదో అన్న…
టీడీపీ నేత, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనో కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఒక ఏడాదిలో 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్.. వేస్ అండ్ మీన్స్కు వెళ్లిన చరిత్ర ఆయనది అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. Read Also: 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. మూడు రాజధానులు అలాగే వస్తాయి: మంత్రి…
మూడు రాజధానుల అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్తగా 26 జిల్లాలు ఎలా వస్తున్నాయో.. అదే తరహాలో మూడు రాజధానులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన వల్ల కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాల విభజన చారిత్రాత్మకం, అభివృద్ధి దాయకం అని ఆయన తెలిపారు. Read Also: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. దరఖాస్తు గడువు మరోసారి పెంపు తెలంగాణలో జిల్లాలను విజయవంతంగా…