కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు రి కన్స్ట్రక్షన్ అవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే కేంద్ర సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్ మాట్లాడుతూ.. 712 కోట్లతో మొదటి విడత స్టేషన్ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీ అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల…
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖలు ఉద్యోగుల బదిలీలకు గైడ్లైన్స్ జారీ చేస్తు్న్నాయి. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రవాణా శాఖలోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ జారీ అయినట్లు తెలిసింది.
జమ్మూకశ్మీర్ ఎన్నికలకు సంబంధించి.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు.. మొన్న ఫారుఖ్ అబ్దుల్లా ఇంటికెళ్లి ఒప్పందం చేసుకుని వచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై కాంగ్రెస్ ఆలోచన ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తామని.. అన్న నేషనల్ కాన్ఫరెన్స్ ని సమర్థిస్తారా? అని ఆయన…
రాష్ట్రంలోని 25,000 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ (బిఎఎస్) కోసం నిధులు విడుదల చేయాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్దిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు శనివారం కోరారు. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు రాసిన లేఖలో హరీశ్రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో ₹130 కోట్లు కేటాయించారని, మొదటి విడతగా ₹ 50 కోట్లు విడుదల…
జంటనగరాల్లో జరగనున్న గణేష్ చతుర్థి వేడుకలపై చర్చించేందుకు శనివారం అంతర్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. GHMC, HMWS&SB, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్, పోలీస్, TSRTC, మెట్రో రైల్, దక్షిణ మధ్య రైల్వే, TGSPDCL, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇరిగేషన్, టూరిజం, EMRI , భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గణేష్ ఉత్సవ సమితి , ఖైరతాబాద్ గణేష్ సమితి…
బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్లో కెమికల్ పౌడర్ వాసన పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణం కెమికల్ పౌడర్ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు.
మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా…
కోల్కతాలో అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 14న తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో అన్ని ఎలక్టివ్ డ్యూటీలు, ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించిన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ( TJUDA) తమ నిరసనలను శుక్రవారం విరమించుకుంది. ఔట్ పేషెంట్, ఎలక్టివ్లు, వార్డు విధులు, అత్యవసర సంరక్షణతో సహా అన్ని వైద్య సేవలు శనివారం నుండి అంతరాయం లేకుండా పనిచేస్తాయని TJUDA శుక్రవారం తెలిపింది. “డాక్టర్ అభయకు న్యాయం చేయడానికి…