NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది…
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం 35 వ సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు. 36 వ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. అభిలాష్ కంకర దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా మరియు మహానుభావుడు అనే మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి..ఈరోజు శర్వా పుట్టినరోజు సందర్బంగా…
తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు.
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
మలయాళ సూపర్ స్టార్ హీరో మమ్ముట్టి లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు… ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. గతనెలలో విడుదలైన మలయాళ సినిమాలు…
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
హర్యానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హర్యానాలోని రేవారిలో బుధవారం హర్యానా రోడ్వేస్ బస్సు కారును ఎదురుగా ఢీకొనడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్…