Uttam Kumar Reddy : మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDSA బృందం నాలుగు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఎ నాలుగు నెలలు రిపోర్టు సమర్పిస్తామని తెలిపిందని, అంతకన్నా ముందే ప్రాథమిక రిపోర్ట్ వీలైనంత తొందరలో ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగా వెంటనే డాం రిపేర్ తో పాటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ టిఆర్ఎస్ కు ఏటీఎంగా మారటానికి ప్రధాన కారణమే మోడీ ప్రభుత్వమని, కార్పొరేషన్ల ద్వారా 84 వేల కోట్ల రుణం అందించింది కేంద్రమే కదా అని ఆయన అన్నారు. మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మేము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామన్నారు. మీ సలహాలను పాటించి మెడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు. బ్యారేజి డ్యామేజ్ కి రీజన్స్ చెప్పాలన్నారు.
Viral Video : స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. షాక్ అవుతున్న నెటిజన్స్…
Also Read
అంతేకాకుండా.. ‘సమస్యకు కారణం ఎవరు అనేది అడిగాం. వర్షాలు రాకముందే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. బ్యారేజీలు రిపెర్స్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..సాధ్యాసాధ్యాలు చెప్పండి. NDSA కమిటీకి పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ NDSA కమిటీ కి ఇవ్వాలని కోరుతున్నాం. ఎవరైనా NDSA కమిటీ కి సహకారం ఇవ్వకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కటినమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే వచ్చినట్లు చెప్పిన కమిటీ. రేపు ఉదయం మెడిగడ్డ, అనంతరం అన్నారం, రేపు రాత్రి రామగుండం. 8న సుంధిల్ల బ్యారేజి విసిట్ ఉంటుంది. టెస్టుల కోసం ప్రపంచంలో ఎంత అత్యాధునిక టెక్నాలజీ వాడాలని సుచించాం. రిపేర్ చేసి మళ్ళీ అందుబాటులోకి వస్తె రాష్ట్రానికి మంచిది. వర్షాకాలంకు ముందే అందుబాటులోకి వస్తె మరీ మంచిది. ENC నాగేందర్ ఆధ్వర్యంలో అయ్యర్ కమిటీ విసిట్ పూర్తి చేసుకుంటుంది. NDSA ప్రాథమిక రిపోర్ట్ రాగానే తప్పులు ఉంటే నిర్మాణ సంస్థ పై చర్యలు తీసుకుంటాం. L AND T రాష్ట్రంలో అనేక వ్యాపారాలు చేస్తోంది. మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. నిర్మాణ సంస్థ కు భాధ్యత ఉండాలి. జుడిష్యల్ ఎంక్వైరీ పై త్వరలోనే ముందడుగు ఉంటుంది’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Janhvi Kapoor: పుట్టినరోజున చిన్నమ్మతో కలిసి తిరుపతిలో సందడి చేసిన దేవర బ్యూటీ..
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!