Home
Latest News
Latest News News
-
దేశంలో 35కు చేరిన ఒమిక్రాన్ కేసులు
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వేరియంట్ బయటపడ్డ 15 రోజుల్లోనే 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. రోజురోజుకు చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంది. అయితే… -
కృష్ణా జిల్లాలో దారుణం.. వాచ్మెన్ను చంపి మద్యం చోరీ..
కృష్ణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జి.కొండూరు మండలం వెలగలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణ వాచ్మెన్ సాంబయ్యను గుర్తు తెలియని దుండగలు గత రాత్రి హత్య చేశారు. అంతేకాకుండా హత్య అనంతరం మద్యం బాటిళ్లతో పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మద్యానికి బానిసైన వారే ఈ హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు… -
ఎలక్ట్రిక్ వాహనాలదారులకు శుభవార్త.. త్వరలో అక్కడ ఛార్జింగ్ పాయింట్లు..!
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL), తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఆర్ఈడీసీవోలు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి అధికారులు దీనిని… -
శివాజీరావు గైక్వాడ్ టూ సూపర్స్టార్ రజినీకాంత్.. అంతులేని కథతో ఆరంభం..
తమిళ్ తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.. ఆయన కర్ణాటకలో 1950 డిసెంబర్ 12 జన్మించారు. అయితే ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన సినీ జీవితం 1975లో ప్రారంభమైంది. ఆయన సినిరంగప్రవేశం చేయకముందు కొన్ని రోజులు బస్ కండక్టర్గా కూడా పనిచేశారు. ఆయన మొదటి సినిమా తమిళంలో ‘ఆపూర్వరాగంగళ్’.. ఈ సినిమాకు దర్శకుడు కె.బాలచందర్.. రజినీ 1976లో… -
లైవ్ : తెలుగుతేజం సాయితేజ అంత్యక్రియలు
ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే నిన్న బెంగళూరుకు చేరుకున్న సాయితేజ పార్థీవదేహం ఈ రోజు ఎగువరేగడుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ మృతదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం సాయితేజ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయితేజ అంత్యక్రియలు వీక్షించేందుకు ఈ క్రింద ఉన్న వీడియో చూడండి. -
42వ రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు 42వ రోజు పాదయాత్ర అంజిమేడులో ప్రారంభం కానుంది. అయితే అంజిమేడు నుంచి 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి రేణిగుంటకు చేరుకోనుంది. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఊరురా ప్రజలు, రైతులు,… -
శరవేగంగా మక్కా మసీదు పనులు..
చారిత్రాత్మక మక్కా మసీదులో చేపట్టిన మరమ్మతులు, పునరుద్దరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రంజాన్లోపు పనులు పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ హెరిటేజ్ శాఖను కోరింది. 17వ శతాబ్దపు మసీదు మరమ్మతు పనులను 2017లో అధికారులు ప్రారంభించారు. తొలుత 18 నెలల గడువును అధికారులు నిర్దేశించగా వివిధ కారణాలతో ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. వారసత్వ కట్టడాల… -
66 దేశాలకు పాకిన ఒమిక్రాన్.. పలు దేశాల్లో ఆంక్షలు
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని ప్రజలపై విరుచుకు పడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 66 దేశాలకు వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇటీవల భారత్లోకి కూడా ప్రవేశించింది. దీంతో ప్రస్తుతం భారత్లో 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉండడంతో నిన్న, నేడు ఆ రాష్ట్రంలో… -
మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతాను సైతం సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కొంత సమయం వరకు హ్యాక్ అయింది.ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే కొంత సేపటి తర్వాత ట్విట్టర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో దుండగులు బిట్ కాయిన్ను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. భారత ప్రభుత్వం 500 బిట్ కాయిన్లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతున్నారని హ్యకర్లు వాటికి సంబంధించిన లింక్లను పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు… -
సమాధానం చెప్పలేని సీఎం రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు : చంద్రబాబు
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
తాజావార్తలు
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!