ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని ప్రజలపై విరుచుకు పడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 66 దేశాలకు వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇటీవల భారత్లోకి కూడా ప్రవేశించింది. దీంతో ప్రస్తుతం భారత్లో 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉండడంతో నిన్న, నేడు ఆ రాష్ట్రంలో 144 సెక్షన్లు అమలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5,634 ఒమిక్రాన్ కేసులు కావడంతో పలు దేశాల్లో ఆంక్షలు విధించారు. యూకేలో 1,898, డెన్మార్క్లో 1,840, సౌతాఫ్రికాలో 633, యూఎస్లో 115, నార్వేలో 109 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.