Kuwait: మిడిల్ ఈస్ట్లో అత్యంత ధనిక దేశంగా, చమురు సంపన్నమైన కువైట్ పాలకుడు, ఎమిర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా మరణించినట్లు రాయల్ కోర్ట్ తెలిపింది. మూడేళ్లుగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలుపుతున్నట్లు కువైట్ ప్రభుత్వ టెలివిజన్ ఒక ప్రకటనలో పేర్కోంది. గత నవంబర్ నెలలో షేక్ నవాఫ్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు.