Kota: మెదడుకు ఎక్కని చదువులు, తీవ్ర ఒత్తిడి, ఎక్కడ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేమో అనే భయం ఇలా నీట్ విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా రెండు పదులు నిండని వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.