West Bengal: ఇక, బెంగాల్ వంతు..? బీజేపీతో టచ్లోకి 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ నేత మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చర్చగా మారాయి.. అసలే, తమకు సరైన మెజార్టీ లేని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. అప్రజాస్వామిక పద్దతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను కూల్చివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో.. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తి.. మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? మతో 38 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.. వారిలో 21 మంది ప్రత్యక్షంగా టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు.. దీనిపై మీడియా మళ్లీ మళ్లీ ప్రశ్నించగా.. ట్రైలర్ను విడుదల చేయమని నన్ను అడగవద్దు, సంగీతాన్ని ఆస్వాదించండి అని వ్యాఖ్యానించారు.
Read Also: New Twist in Saipriya Case: మరోసారి ఝలక్ ఇచ్చిన సాయిప్రియ..!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు “ఆపరేషన్ లోటస్” ప్లాన్ చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత మిథున్ చక్రవర్త ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.. అయితే, రెండు రోజుల క్రితం, మమతా బెనర్జీ.. బీజేపీకి సవాలు విసిరారు, శివసేనలో తిరుగుబాటు తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనం కావడం గురించి ప్రస్తావిస్తూ, ఇందులో బీజేపీ సహాయక పాత్ర పోషించిందని.. బీజేపీ ఎజెండాలో తన రాష్ట్రం తర్వాతి స్థానంలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర ఈసారి యుద్ధం చేయలేకపోయింది. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు బెంగాల్ అంటున్నారని.. కానీ, ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి.. మీరు బంగాళాఖాతం దాటాలి.. మొసళ్ళు మిమ్మల్ని కొరుకుతాయి.. రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని కొరికేస్తుంది.. ఉత్తర బెంగాల్లో ఏనుగులు మీపైకి దొర్లుతాయి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్లో తనను గద్దె దించేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. గత సంవత్సరం, రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అన్ని వనరులను మరియు దాని అగ్ర నాయకులను దింపినా.. కఠినమైన సవాలుతో పోరాడిన తర్వాత ఆమె బెంగాల్లో మూడవసారి సీఎం సీటును అధిష్టించారు.. కాగా, మిథున్ చక్రవర్తి గత సంవత్సరం ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటాలతో బీజేపీలో చేరారు, అయితే, సినీ నటుడిగా బెంగాల్లో భారీ ప్రజాదరణ ఉన్నప్పటికీ ఓటర్లపై తగినంత ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు మిథున్ చక్రవర్తి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు టీఎంసీ ఎంపీ డోలా సేన్..
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
OTR : ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఆందోళనలు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!