West Bengal: ఇక, బెంగాల్ వంతు..? బీజేపీతో టచ్లోకి 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ నేత మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చర్చగా మారాయి.. అసలే, తమకు సరైన మెజార్టీ లేని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. అప్రజాస్వామిక పద్దతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను కూల్చివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో.. కోల్కతాలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తి.. మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? మతో 38 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.. వారిలో 21 మంది ప్రత్యక్షంగా టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు.. దీనిపై మీడియా మళ్లీ మళ్లీ ప్రశ్నించగా.. ట్రైలర్ను విడుదల చేయమని నన్ను అడగవద్దు, సంగీతాన్ని ఆస్వాదించండి అని వ్యాఖ్యానించారు.
Read Also: New Twist in Saipriya Case: మరోసారి ఝలక్ ఇచ్చిన సాయిప్రియ..!
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు “ఆపరేషన్ లోటస్” ప్లాన్ చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత మిథున్ చక్రవర్త ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.. అయితే, రెండు రోజుల క్రితం, మమతా బెనర్జీ.. బీజేపీకి సవాలు విసిరారు, శివసేనలో తిరుగుబాటు తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనం కావడం గురించి ప్రస్తావిస్తూ, ఇందులో బీజేపీ సహాయక పాత్ర పోషించిందని.. బీజేపీ ఎజెండాలో తన రాష్ట్రం తర్వాతి స్థానంలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర ఈసారి యుద్ధం చేయలేకపోయింది. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు బెంగాల్ అంటున్నారని.. కానీ, ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి.. మీరు బంగాళాఖాతం దాటాలి.. మొసళ్ళు మిమ్మల్ని కొరుకుతాయి.. రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని కొరికేస్తుంది.. ఉత్తర బెంగాల్లో ఏనుగులు మీపైకి దొర్లుతాయి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్లో తనను గద్దె దించేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. గత సంవత్సరం, రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అన్ని వనరులను మరియు దాని అగ్ర నాయకులను దింపినా.. కఠినమైన సవాలుతో పోరాడిన తర్వాత ఆమె బెంగాల్లో మూడవసారి సీఎం సీటును అధిష్టించారు.. కాగా, మిథున్ చక్రవర్తి గత సంవత్సరం ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటాలతో బీజేపీలో చేరారు, అయితే, సినీ నటుడిగా బెంగాల్లో భారీ ప్రజాదరణ ఉన్నప్పటికీ ఓటర్లపై తగినంత ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు మిథున్ చక్రవర్తి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు టీఎంసీ ఎంపీ డోలా సేన్..
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!