ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ లిస్ట్ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊహించినట్లుగానే లక్నో తమ కెప్టెన్ కేఎల్…
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాతమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో రెండో టెస్ట్ ఆడుతున్నట్లు కివీస్ కెప్టెన్ చెప్పాడు. గాయంతో మాట్ హెన్రీ దూరం కాగా.. మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు తాము మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్ను తుది జట్టు నుంచి…
బెంగళూరులో న్యూజిలాండ్తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్లో విఫలమైన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో బాగా ఆడారు. కానీ సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక్కడే దారుణంగా విఫలమయి.. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. రాహుల్ జట్టులో ఎందుకు అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడంతో రాహుల్కు రెండో టెస్టుల్లో అవకాశం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్…
ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తన కెప్టెన్ను వదిలేసేందుకు సిద్దమైందట. ఐపీఎల్ 2024…
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో టెస్టులో విజయం సాధించాలని చూస్తోంది. పూణేలో గురువారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుది జట్టులో స్థానం కోసం సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ల మధ్య గట్టి పోటీనెలకొంది. ఇది వాస్తవమేనని, అందులో దాచడానికి ఏమీ లేదని టీమిండియా సహాయ కోచ్ ర్యాన్…
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్లో మార్పులు అనివార్యంగా…
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్…
KL Rahul about Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో డగౌట్లోని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తమకు స్పష్టమైన సందేశం వచ్చిందని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పాడు. ఔటైనా ఫర్వాలేదు కానీ.. వేగంగా ఆడి ఎక్కువ పరుగులు చేయాలని సూచించాడని తెలిపాడు. కెప్టెన్ ఆదేశాలకు తగ్గట్టుగానే ఆడినట్లు రాహుల్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో బంగ్లాదేశ్పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది.…
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో బౌలింగ్ ఎంఛుకున్నాడు. పిచ్పై తేమ ఉందని, దానిని ఉపయోగించాలనుకుంటున్నామని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లతో బంగ్లా బరిలోకి దిగుతోందని శాంటో తెలిపాడు. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి…
Rishabh Pant To Replace Dhruv Jurel in IND vs BAN 1st Test: ఆరు నెలల తర్వాత భారత జట్టు టెస్టు క్రికెట్లో బిజీ అవుతోంది. నాలుగు నెలల వ్యవధిలో పది టెస్టులు ఆడబోతున్న టీమిండియా.. నేడు బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల సిరీస్ను ఆరంభిస్తోంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో గురువారం తొలి టెస్ట్ ఆరంభం కానుంది. విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగుతోంది. టెస్టు సిరీస్లో పాకిస్థాన్ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన…