IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
- బెంగళూరు టెస్టులో ఎదురీదుతోన్న భారత్
- ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
- పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్లపైనే ఉంది. గాయపడిన రిషబ్ పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో చూడాలి.
మూడోరోజు 180/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134; 157 బంతుల్లో 13×4, 4×6) అద్భుత శతకం బాదాడు. పేసర్ టీమ్ సౌథీ (65; 73 బంతుల్లో 5×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/72), కుల్దీప్ యాదవ్ (3/99) చెరో మూడు వికెట్స్ పడగొట్టారు. ఆపై రెండో ఇన్నింగ్స్లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), యశస్వి జైస్వాల్ (35; 52 బంతుల్లో 6×4) మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరినీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్పై విజయం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్కు న్యూజిలాండ్!
సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6) క్రీజులోకి రాగానే ధాటిగా ఆడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6) బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరు జట్టు స్కోరును 200 దాటించారు. దాంతో మరో వికెట్ కోల్పోకుండా భారత్ రోజును ముగించేలా కనిపించింది. కానీ ఆటలో చివరి బంతికి ఫిలిప్స్ బౌలింగ్లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఇచ్చాడు. ఇది భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. నేడు ఎదురుదాడే మంత్రంగా ఆడితే భారత్ సక్సెస్ అవ్వొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!