తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు జేపీ నడ్డా ఫోన్ చేశారు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే.. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి అధ్యక్షునిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అలాగే.. తెలంగాణకు అధ్యక్షులుగా పని చేశాను.. అయితే పార్టీ మరోసారి నాపై ఈ బాధ్యత పెట్టింది.. బీజేపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచా.. పార్టీని ఎదీ ఎపుడు అడగలేదు అని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? అలా అనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగతున్న సమావేశానికి కూడా కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సర్వత్రా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అభినందించారు.