Kishan Reddy: అమెరికాకు కిషన్ రెడ్డి.. రేపు హెచ్ఎల్పీఎఫ్ వేదికగా ప్రసంగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అమెరికాకు బయలుదేరారు. ప్రపంచ పర్యాటకరంగ అభివృద్ధిపై ప్రసంగించేందుకు కిషన్ రెడ్డిని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆహ్వానించింది. ఇది కిషన్ రెడ్డికి దక్కిన అరుదైన అవకాశం. రేపు (శుక్రవారం) న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. HLPF వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం దక్కింది. జీ-20 టూరిజం చైర్ హోదాలో కేంద్రమంత్రి హాజరుకానున్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అటునుంచే లండన్కు బయలుదేరనున్నారు. 19వ తేదీ ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.
Read also: Pilot Rohith Reddy: పైలట్ రోహిత్ రెడ్డి మహా యాగంలో అపశ్రుతి.. అగ్నికి ఆహుతైన మండపం
Also Read
ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరుకాలేదు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్న బండి సంజయ్ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు. తన శాఖ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఈ నెల 8న వరంగల్ లో జరిగిన ప్రధాని మోడీ పర్యటన విజయవంతం కావడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియామకం తర్వాత రెండోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. కిషన్ రెడ్డి వరుసగా రెండు సమావేశాలకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో గత సమావేశానికి హాజరు కాలేదని కిషన్ రెడ్డి సమాచారం పంపారు.
Botsa Satyanarayana: పవన్ కళ్యాణ్ కామెంట్స్కు బొత్స కౌంటర్
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!