రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అహంకారన్ని దించాలంటే చురుక్కు పెట్టాల్సిందే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేడలు వంచుతామన్నారు.
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిస్తే.. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
KCR: బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Etela Rajender: 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పేరు కేసీఆర్ కి రావొచ్చు కానీ కష్టపడింది మేము అని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Shabbir Ali: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు.
ఆగస్ట్ లో రైతు రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ బోగస్ మాటలు చెబుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు. జూన్ లో రుణమాఫీ చేయాలని 5700కోట్ల రూపాయలు లేని ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను తిరిగి మోసం చేయాలని చూస్తోందన్నారు.