BJP: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న 136 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 65 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామని భావించిన జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. దాదాపుగా 34 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లను, సీట్లను సంపాదించుకుంది. బీజేపీకి పట్టున్న చోట్ల కూడా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.