Kavitha : ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్ని
- కరీంనగర్లో జాగృతి జనం బాట పాదయాత్రకు ప్రజల విశేష స్పందన
- రైతులు, విద్య, వైద్యం, మైనారిటీల సమస్యలపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన కవిత
- పర్యావరణ పరిరక్షణ, సామాజిక తెలంగాణ కోసం జాగృతి కట్టుబడి ఉందని హామీ
- ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు, నేను ఫ్రీ బర్డ్ని : కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha : కరీంనగర్ జిల్లా పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. “సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉంది,” అని కవిత తెలిపారు.
సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె, ఆర్టీసీ విభాగంలో ఉన్న సమస్యలపై విప్లవాత్మక ఆలోచన అవసరమని సూచించారు. “సామాజిక తెలంగాణను సాకారం చేయడం మనందరి బాధ్యత,” అని అన్నారు. “తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనం అందరం కృషి చేశాం. కానీ కరీంనగర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ సమస్యలపై దృష్టి పెట్టాలి,” అని వ్యాఖ్యానించారు. పంటనష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు చనిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గురుకుల పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. “రాష్ట్రంలో మైనారిటీ సమస్యలను పట్టించుకోవాలి. మైనారిటీ అభివృద్ధికి కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాలి. ఎన్నికలు సమీపించాకే మైనారిటీల గుర్తొచ్చాయా?” అని ప్రశ్నించారు. తన రాజకీయ పరిస్థితిపై స్పందిస్తూ కవిత, “ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్ని. పర్యావరణ పరిరక్షణను మా జాగృతి ప్రాధాన్యంగా తీసుకుంటుంది. తెలంగాణలో రాజకీయ శూన్యత నెలకొంది, ప్రజల గొంతుకగా మారబోతున్నాం,” అని తెలిపారు.
మానకొండూర్ నియోజకవర్గంలో పంటనష్టం జరిగినా, అక్కడి ఎమ్మెల్యేలు స్పందించలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటివరకు కార్మిక చట్టాలపై స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని కవిత పేర్కొన్నారు. తన ఎమ్మెల్సీ పదవీ రాజీనామా అంశంపై మళ్లీ చైర్మన్, స్పీకర్లను కలుస్తానని తెలిపారు. “నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. ప్రజల కోసం, సమాజం కోసం నా గొంతు వినిపిస్తూనే ఉంటాను,” అని కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!