Joshimath Land Subsidence: జోషీమఠ్లో 600 ఇళ్లకు పగుళ్లు.. తరలిపోతున్న ప్రజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath Land Subsidence ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా జోషీమఠ్ నగరంలో భూమి కుంగిపోవడం కలకలం రేపుతోంది. భూమి కుంగడం వల్ల దాదాపు 600 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకొచ్చి ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే కాలం వెళ్లదీస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం చమోలీ జిల్లాలోని జోషిమఠ్లో భూమి క్షీణించిన నేపథ్యంలో, ఈ సాయంత్రం డెహ్రాడూన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జోషిమఠ్లో కొండచరియలు విరిగిపడటం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఈ సాయంత్రం డెహ్రాడూన్లో ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఉత్తరాఖండ్ సీఎం చెప్పారు. ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ, నీటిపారుదల, హోంశాఖ అధికారులతో పాటు కమిషనర్ గర్వాల్ మండల్, జిల్లా మేజిస్ట్రేట్ చమోలి కూడా పాల్గొంటారు. శనివారం జోషిమఠ్ను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తానని ధామి తెలిపారు.
బీజేపీకి చెందిన ఓ బృందాన్ని కూడా అక్కడికి పంపించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా, భూమి ముంపు ఘటన మరియు నివేదించబడుతున్న నష్టాలను అంచనా వేయడానికి బీజేపీ రాష్ట్ర విభాగం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి సమన్వయంతో 14 మంది సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇలా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గత అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి కాగడాలతో నిరసన తెలిపారు. బద్రినాథ్, హమ్కుండ్ క్షేత్రాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ప్రాంతంలో భూమి కుంగి పోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్లకు పగుళ్లు రావడంతో జోషిమఠ్ నుంచి ఇప్పటి వరకు 66 కుటుంబాలు వలస వెళ్లినట్లు సమాచారం. జోషిమఠ్లోని దాదాపు 600 ఇళ్లలో పగుళ్లు ఏర్పడినట్లు, పట్టణంలో కొనసాగుతున్న భూమి క్షీణత కారణంగా జిల్లా విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. సుమారు 500 కుటుంబాలు అక్కడే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలుస్తోంది. ఇల్లు పగుళ్లు ఇచ్చినప్పటికీ తమకు మరో మార్గం లేక ఇక్కడే ఉంటున్నట్లు వారు తెలిపారు. భూమి కుంగిపోవడం వల్ల 3,000 మంది ఇబ్బందులు పడుతున్నట్లు మున్సిపల్ అధికారులు కూడా తెలిపారు. ఉత్తరాఖండ్లోని పవిత్ర పట్టణమైన జోషిమత్ నివాసితులు పట్టణంలోని ఇళ్లు, రహదారి మార్గాల్లో పగుళ్లను గమనించిన తర్వాత ఆందోళన చెందారు. అక్కడి నుంచి ఖాళీ చేసి మునిసిపాలిటీలోని నైట్ షెల్టర్లకు తరలించారు. బాధిత ప్రజలు, వారి కుటుంబాలు, పిల్లలు ప్రస్తుతం నైట్ షెల్టర్లలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడి నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం నుంచి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. అయితే తమకు ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
Urvashi Rautela: రిషబ్ చేరిన ఆస్పత్రి ఫొటోను పోస్ట్ చేసిన ఊర్వశి..
ఉత్తరాఖండ్ ప్రభుత్వం జోషిమఠ్లో భూమి క్షీణించడం, దాని ఫలితంగా ఇళ్లకు నష్టం వాటిల్లడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది.ఈ బృందం ఘటనాస్థలిని సందర్శించి భూమి పడిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు ఏర్పాటు చేసిన బృందంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్స్టిట్యూట్, ఐఐటీ రూర్కీకి చెందిన ఇంజనీర్లను చేర్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జోషీ మఠ్ వెళ్లి సహాయ చర్యలు చేపట్టాయి. ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ కూడా జోషీమఠ్ వెళ్లి, పగుళ్లను పరిశీలించనున్నారు. నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని ఆయన దెహ్రాదూన్లో తెలిపారు.
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్మీట్పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!