Bengaluru Blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితులును శుక్రవారం ఎన్ఐఏ పశ్చిమబెంగాల్లో అరెస్ట్ చేసింది. వీరిని విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ గుర్తింపును కప్పిపుచ్చుకునేందుకు హిందూ పేర్లను వాడినట్లు తేలింది. నిందితులిద్దరు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మతీన్ తాహాలు మారుపేర్లు ఉపయోగించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. 42 రోజలు తర్వాత పట్టుబడిని వీరు గెస్ట్హౌజ్, ప్రైవేట్ లాడ్జిల్లోనే బస చేశారు. కర్ణాటక శివమొగ్గకు చెందిన…
Bengaluru cafe blast: బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిని నిన్న పశ్చిమబెంగాల్ నుంచి అరెస్ట్ చేశారు. అరెస్టైన్ అబ్దుల్ మతీన్ తాహాని ‘‘ అత్యంత విలువైన ఆస్తి’’గా ఉగ్రసంస్థ ఐఎస్ఐఎస్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
Jihadi bride: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ, కరుగుగట్టిన సిరియాలోని ఐఎస్ఐఎస్లో చేరిన బ్రిటీష్ యువతి తన పౌరసత్వాన్ని కోల్పోయింది. ఈ కేసును అక్కడి కోర్టులో ఛాలెంజ్ చేసిన సదరు యువతి, కేసును కోల్పోయింది. ‘జీహాదీ వధువు’గా పేరు పొందిన బ్రిటీష్ యువతి షమీమా బేగం పౌరసత్వం రద్దును కోర్టు సమర్థించింది. 15 ఏళ్ల వయసులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ఆకర్షితమైన షమీనా బేగం తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి సిరియా వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంది.
Coimbatore Car Blast: 2022లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కోయంబత్తూర్లో కారు బాంబు పేలుడు, ఐసిస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. శనివారం నిర్వహించిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్లో భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు ల్యాప్టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ…
NIA Raids : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఉత్తర రైల్వేలో ఒక క్లర్క్ కోసం వెతుకుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Mumbai Attack: దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఏకంగా 40 డోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్గా నిందితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్ని అరెస్ట్ చేశారు.
దేశంలోని ఐసిస్ తో సంబంధం ఉన్న ప్రాంతాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దాడులు చేసింది. దక్షిణాది రాష్ట్రాలోని మొత్తం 19 ప్రదేశాలలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఈ దాడిలో ఎన్ఐఏ బృందాలు ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు, కార్యకలాపాలను ప్రోత్సహించడంలో వారు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు, మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె, జార్ఖండ్లోని జంషెడ్పూర్, బొకారో, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. ఈ రైడ్స్…
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది.
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
ISIS: దేశవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసిన ఏడుగురు అనుమానిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులందరూ వారి హ్యాండర్ల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఐసిస్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిధులను సేకరించినట్లు దర్యాప్తులో తేలిందని చార్జిషీట్ పేర్కొంది.