Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
- తీవ్ర రూపం దాల్చుతున్న పశ్చిమాసియా యుద్ధం
- బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
- షాకైన అమెరికా, ప్రపంచ దేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణినే కారణంగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదట నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ను చేరుకునే క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోందని ట్రంప్, నెతన్యాహు ఆరోపిస్తూ వచ్చారు. అన్నట్టుగానే తాజాగా ఆ అనుమానం నిజమైంది.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్

హిందూ మహా సముద్రంలోని చాగోస్ దీవుల్లోని డియాగో గార్సియాలో ఉన్న అమెరికా-బ్రిటన్కు సంయుక్తంగా ఉన్న సైనిక స్థావరంపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే రెండింటిలో ఏ క్షిపణి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదు. ఒకటి మార్గమధ్యలో విఫలం కాగా.. ఇంకొక క్షిపణిని అమెరికా యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఇంటర్సెప్టర్ అడ్డుకుంది. అయితే బాలిస్టిక్ క్షిపణి ఏమైంది? అనేది స్పష్టత రాలేదు. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ తన కథనంలో పేర్కొంది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఇరాన్ భూభాగం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరానికి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 2,000-3,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల క్షిపణులు మాత్రమే ఉన్నాయని ప్రపంచం భావించింది. కానీ తాజా ఘటనతో టెహ్రాన్ దగ్గర 4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదింగల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తేలిపోయింది. ఈ పరిణామం పశ్చిమ దేశాలను మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా పెంటగాన్ స్పందించలేదు. ఏ అధికారి కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం.. ఇరాన్ దక్షిణాసియాను కూడా ఛేదించగలదని అర్థమవుతోంది.
ప్రస్తుత యుద్ధాన్ని ఇరాన్ మరింత తీవ్రతరం చేసి పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ సందేశం పంపే అవకాశం ఉందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!