Iran-US: బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్.. షాకైన అమెరికా!
- తీవ్ర రూపం దాల్చుతున్న పశ్చిమాసియా యుద్ధం
- బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
- షాకైన అమెరికా, ప్రపంచ దేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణినే కారణంగా అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మొదట నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ను చేరుకునే క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోందని ట్రంప్, నెతన్యాహు ఆరోపిస్తూ వచ్చారు. అన్నట్టుగానే తాజాగా ఆ అనుమానం నిజమైంది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ

హిందూ మహా సముద్రంలోని చాగోస్ దీవుల్లోని డియాగో గార్సియాలో ఉన్న అమెరికా-బ్రిటన్కు సంయుక్తంగా ఉన్న సైనిక స్థావరంపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే రెండింటిలో ఏ క్షిపణి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదు. ఒకటి మార్గమధ్యలో విఫలం కాగా.. ఇంకొక క్షిపణిని అమెరికా యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఇంటర్సెప్టర్ అడ్డుకుంది. అయితే బాలిస్టిక్ క్షిపణి ఏమైంది? అనేది స్పష్టత రాలేదు. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ‘‘వాల్ స్ట్రీట్ జర్నల్’’ తన కథనంలో పేర్కొంది. ఈ ఘటనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఇరాన్ భూభాగం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరానికి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర 2,000-3,000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల క్షిపణులు మాత్రమే ఉన్నాయని ప్రపంచం భావించింది. కానీ తాజా ఘటనతో టెహ్రాన్ దగ్గర 4,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదింగల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని తేలిపోయింది. ఈ పరిణామం పశ్చిమ దేశాలను మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి.
అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారికంగా పెంటగాన్ స్పందించలేదు. ఏ అధికారి కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం.. ఇరాన్ దక్షిణాసియాను కూడా ఛేదించగలదని అర్థమవుతోంది.
ప్రస్తుత యుద్ధాన్ని ఇరాన్ మరింత తీవ్రతరం చేసి పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్ సందేశం పంపే అవకాశం ఉందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..