గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి గోరంట్లకు చెందిన షేక్ నసీమా అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ మహిళ జీజీహెచ్కు చేరుకుని.. బిడ్డ బాగున్నాడు అంటూ చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి పరారైంది.
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్ఎన్వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.