ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి. ఎన్నో ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారాలు.. విశేషాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కొన్ని తేగల ఆచారాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంటాయి. ఇలాంటి ఆచారాల్లో డానీ తెగ ఆచారం చాలా వింతగా ఉంటుంది. వింతగా ఉండటమే కాదు.. భయంకరంగా ఉంటుంది. ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే డాని తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ…
సాధారణంగా జూ పార్కులకు వెళ్తే చాలా మంది అక్కడి జంతువులను చూసి మైమరిచిపోతుంటారు. కొన్ని జంతువులతో ఫోటోలు దిగాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ఒక్కోసారి కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తులు జంతువులతో పరాచకాలు ఆడి ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారు. ఇండోనేషియాలో కూడా ఓ యువకుడు ఇలాగే ప్రవర్తించి కష్టాల్లో పడ్డాడు. చింపాంజీతో ఆటలాడి కాసేపు గిలగిల లాడిపోయాడు. దీంతో సదరు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Elephant Walking: వాకింగ్ కి…
హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్ ఓషియన్ సునామీ వార్నింగ్ మెటిగేషన్ సిస్టమ్ (ఐఓఎస్ డబ్ల్యూఎంఎస్). ఇండోనేషియా సమీపంలోని తూర్పు తైమూర్ దేశంలో శుక్రవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో హిందూ మహాసముద్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం సునామీ ప్రమాదాన్ని తీసుకురావచ్చని అంచాన వేసింది. తూర్పు తైమూర్ ఇండోనిషియా మధ్య తైమూర్ ద్వీపం నుంచి 51.4 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇండోనేషియా దాని పరిసర దేశాలు ‘పసిఫిక్…
ఆసియా కప్ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్ 15 గోల్స్ తేడాతో…
ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎప్రిల్ 28న పాయాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కార్. పామాయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తడితో అక్కడి…
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల…
మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది.. ఈ నెలలో దాదాపు నాలుగు సార్లు భూప్రకంపనలు సంభవించగా… ఇవాళ ఉదయం 6.73 గంటల ప్రాంతంలో మరోసారి తీవ్రమైన భూకంపం వచ్చింది… దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.. సులవేసి కొటమోబాగుకు 779 కిలోమీటర్ల దూరంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. కాగా, ఈ మధ్య ఇండోనేషియాను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి.. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు…
భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ…
అదృష్టం కలిసి వస్తే బికారి కూడా బిలియనీర్ అవుతాడని మరోసారి నిరూపణ అయింది. నిత్యం సముద్రంలో తిరిగే మత్స్యకారులకు అప్పుడప్పుడు లక్షల విలువచేసే చేపలు పడుతుంటాయి. కానీ ఓ మత్స్యకారుడి పంట పండింది. అతని వలలో చేపలు కాదు బరువైన వస్తువులు పడ్డాయి. వాటిని తెరిచి చూస్తే అంతే.. కళ్ళు చెదిరిపోయాయి. రాత్రిక రాత్రి ఆ మత్స్యకారుడు లక్షలు సంపాదించాడు. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళ్ళి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఎంత…
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి…