పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది.
తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున…