IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్.. రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయడం సరికాదు!
- విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్
- రిజర్వ్ బెంచ్లో వరుణ్ చక్రవర్తి
- టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో వరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఇప్పటికే మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. 3-0 తేడాతో సిరీస్ను ఖాయం చేసుకుంది. అయినప్పటికీ ఈ సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో అన్ని మ్యాచుల్లోనూ ఆడించాలంటూ సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్కప్కు ముందు ప్రధాన బౌలర్లను రిజర్వ్ బెంచ్లో ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు.
‘న్యూజిలాండ్తో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ పూర్తయిన వెంటనే టీ20 వరల్డ్కప్ 2026 జరగనుంది. వరుణ్ చక్రవర్తి మన ప్రధాన బౌలర్. పొట్టి ఫార్మాట్లో బౌలర్ రిథమ్ చాలా కీలకం. అతడిని వరల్డ్కప్కు ముందు జరగబోయే మ్యాచ్లలో రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదు. మేము కేవలం నీకు విశ్రాంతి ఇస్తున్నాం, రవి బిష్ణోయ్ను పరీక్షిస్తున్నామని చెప్పినా.. అది వరుణ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం’ అని అజింక్య రహానే అన్నాడు. ప్రస్తుతం వరుణ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 804 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read
- KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
- IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
Also Read: IND vs NZ 4th T20: నాలుగో టీ20 తుది జట్టులో కీలక మార్పులు.. హార్దిక్, బుమ్రా దూరం!
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు వరుణ్ చక్రవర్తి ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే సామర్థ్యం అతడికి అదనపు బలం. ఇప్పటికే న్యూజిలాండ్పై 3-0తో సిరీస్ గెలిచిన భారత్.. చివరి రెండు టీ20ల్లో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్ల్లో ఆడిన వరుణ్.. విశ్రాంతి పేరుతో మూడో టీ20లో ఆడలేదు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ను తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపైనే రహానే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!