IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్.. రిజర్వ్ బెంచ్కు పరిమితం చేయడం సరికాదు!
- విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్
- రిజర్వ్ బెంచ్లో వరుణ్ చక్రవర్తి
- టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో వరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఇప్పటికే మొదటి మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత్.. 3-0 తేడాతో సిరీస్ను ఖాయం చేసుకుంది. అయినప్పటికీ ఈ సిరీస్కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో అన్ని మ్యాచుల్లోనూ ఆడించాలంటూ సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్కప్కు ముందు ప్రధాన బౌలర్లను రిజర్వ్ బెంచ్లో ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు.
‘న్యూజిలాండ్తో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ పూర్తయిన వెంటనే టీ20 వరల్డ్కప్ 2026 జరగనుంది. వరుణ్ చక్రవర్తి మన ప్రధాన బౌలర్. పొట్టి ఫార్మాట్లో బౌలర్ రిథమ్ చాలా కీలకం. అతడిని వరల్డ్కప్కు ముందు జరగబోయే మ్యాచ్లలో రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదు. మేము కేవలం నీకు విశ్రాంతి ఇస్తున్నాం, రవి బిష్ణోయ్ను పరీక్షిస్తున్నామని చెప్పినా.. అది వరుణ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేం’ అని అజింక్య రహానే అన్నాడు. ప్రస్తుతం వరుణ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 804 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read
- Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
- Tilak Varma: వైస్ కెప్టెన్పై పీక్స్లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
- Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
Also Read: IND vs NZ 4th T20: నాలుగో టీ20 తుది జట్టులో కీలక మార్పులు.. హార్దిక్, బుమ్రా దూరం!
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు వరుణ్ చక్రవర్తి ప్రధాన ఆయుధంగా మారనున్నాడు. మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే సామర్థ్యం అతడికి అదనపు బలం. ఇప్పటికే న్యూజిలాండ్పై 3-0తో సిరీస్ గెలిచిన భారత్.. చివరి రెండు టీ20ల్లో ప్రయోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి రెండు మ్యాచ్ల్లో ఆడిన వరుణ్.. విశ్రాంతి పేరుతో మూడో టీ20లో ఆడలేదు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ను తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపైనే రహానే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
-
Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Awiqli Insulin India: మధుమేహ రోగుల కష్టాలు తీరినట్టే.. భారత్లో తొలి ఇన్సులిన్ ‘Awiqli’ విడుదల.. వారానికి ఒక్కసారి చాలు!
-
Team India: ఆ ఘోర పరాజయం నుంచి పాఠాలు.. ఈ తప్పులు సరిదిద్దుకుంటే గెలుపు మనదే గురూ..
-
Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!