ఈ వీకెండ్ డబ్బింగ్ తో కలిపి ఎనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అలానే బాలీవుడ్ లో ముగ్గురు తెలుగు దర్శకులు రూపొందించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.
రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడంతో పాటు చిత్ర నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు విద్యుల్ జమ్వాల్. అదే ‘ఐబి 71’. 1971లో జరిగిన ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఇంటెలిజెన్ బ్యూర్ పాత్రను తెలియచేసే…