Scam : మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
- వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ అయిన మోసం
- నకిలీ SEBI సర్టిఫికెట్లతో నమ్మకం పొందిన నేరగాళ్లు
- 19 లావాదేవీల్లో ₹2.58 కోట్లు బదిలీ
- బెదిరింపుల తర్వాత పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించింది.
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
ఆ గ్రూప్లో ఉన్న సైబర్ నేరగాళ్లు తాము సెబి (SEBI) సర్టిఫైడ్ వెబ్సైట్ నడుపుతున్నామని నమ్మబలికారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని నకిలీ సెబి సర్టిఫికెట్లను కూడా పంపారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించడంతో, ఆ దంపతులు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 విడతలుగా (Transactions) వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 2.58 కోట్లు బదిలీ చేశారు. కొంత కాలం తర్వాత పెట్టుబడులు ఆపేయడంతో నేరగాళ్లు అసలు రూపం బయటపెట్టారు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని బాధితులను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగారు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలు , వాట్సాప్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే ట్రేడింగ్ చిట్కాలను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!