Scam : మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
- వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ అయిన మోసం
- నకిలీ SEBI సర్టిఫికెట్లతో నమ్మకం పొందిన నేరగాళ్లు
- 19 లావాదేవీల్లో ₹2.58 కోట్లు బదిలీ
- బెదిరింపుల తర్వాత పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించింది.
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ఆ గ్రూప్లో ఉన్న సైబర్ నేరగాళ్లు తాము సెబి (SEBI) సర్టిఫైడ్ వెబ్సైట్ నడుపుతున్నామని నమ్మబలికారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని నకిలీ సెబి సర్టిఫికెట్లను కూడా పంపారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించడంతో, ఆ దంపతులు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 విడతలుగా (Transactions) వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 2.58 కోట్లు బదిలీ చేశారు. కొంత కాలం తర్వాత పెట్టుబడులు ఆపేయడంతో నేరగాళ్లు అసలు రూపం బయటపెట్టారు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని బాధితులను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగారు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలు , వాట్సాప్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే ట్రేడింగ్ చిట్కాలను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!