Scam : మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
- వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ అయిన మోసం
- నకిలీ SEBI సర్టిఫికెట్లతో నమ్మకం పొందిన నేరగాళ్లు
- 19 లావాదేవీల్లో ₹2.58 కోట్లు బదిలీ
- బెదిరింపుల తర్వాత పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించింది.
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
ఆ గ్రూప్లో ఉన్న సైబర్ నేరగాళ్లు తాము సెబి (SEBI) సర్టిఫైడ్ వెబ్సైట్ నడుపుతున్నామని నమ్మబలికారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని నకిలీ సెబి సర్టిఫికెట్లను కూడా పంపారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించడంతో, ఆ దంపతులు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 విడతలుగా (Transactions) వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 2.58 కోట్లు బదిలీ చేశారు. కొంత కాలం తర్వాత పెట్టుబడులు ఆపేయడంతో నేరగాళ్లు అసలు రూపం బయటపెట్టారు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని బాధితులను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగారు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలు , వాట్సాప్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే ట్రేడింగ్ చిట్కాలను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!