Harpal randhawa: ఆఫ్రికా దేశం జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. అతనితో పాటు ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన రియోజిమ్ ఓనర్ హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.