Harpal randhawa: జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం.. భారత మైనింగ్ వ్యాపారవేత్త మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harpal randhawa: ఆఫ్రికా దేశం జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త మరణించారు. అతనితో పాటు ఆయన కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. బంగారం, బొగ్గు, నికెల్, రాగిని శుధ్ది చేసే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ అయిన రియోజిమ్ ఓనర్ హర్పాల్ రంధావా ఈ ప్రమాదంలో మరణించారు. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
మసావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోయినట్లు జింబాబ్వే మీడియా వెల్లడించింది. రియోజిమ్ కి చెందిన సెస్నా 206 విమానం జింబాబ్వే రాజధాని హరారే నుంచి మురోవా వజ్రాల గనులకు వెళ్తుండగా శుక్రవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్ లోకి వెళ్లే ముందు విమానంలోని సింగిల్ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని, గాలిలోనే పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయాని నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
- Russia-Ukraine War: 5లక్షల మంది రష్యా సైనికులను చంపేసిన జెలెన్స్కీ సేనలు.. పుతిన్కు చా*వు దెబ్బ!
- Smart Border Fencing: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్.. ఇక నుంచి దబిడి దిబిడి..
- Iran-US Tensions: ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు మిసైళ్ల దాడులు.. అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న సంక్షోభం..
Read Also: Nobel Prize: కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి దారి.. ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి..
చనిపోయిన వారిలో నలుగురు విదేశీయులు కాగా.. మిగిలిన ఇద్దరు జింబాబ్వేకు చెందిన వారని పోలీసుల నివేదికను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్య పత్రిక హెరాల్డ్ పేర్కొంది. సెప్టెంబర్ 29 ఉదయం 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో విమానం ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మృతుల పేర్లను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. అయితే రంధావా స్నేహితుడైన జర్నలిస్టు, ఫిల్మ్ మేకర్ హోప్ వెల్ ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. జ్విషావలనేలో జరిగిన విమాన ప్రమాదంలో హర్పాల్ రంధావా చనిపోయినందుకు చాలా బాధపడ్డానని, అతని కొడుకతో సహా మరో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో రాశారు.
తాజావార్తలు
-
LIC Shares: ఎల్ఐసీ షేర్స్ లో భారీ పతనం.. రూ.820 నుండి రూ.414 కు పడిపోయిన షేర్స్.. అసలు కారణం ఇదే!
-
Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
-
Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
-
Vaibhav Sooryavanshi: “రెండు సెంచరీలు మిస్.. ఫీల్ అవుతున్నావా?”.. క్వాలిఫయర్ 2కు ముందు వైభవ్ ఆసక్తికర సమాధానం..
-
Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!