Gyanvapi-Kashi Vishwanath Temple: జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంలో వారణాసి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) రిపోర్టును బహిరంగపరచాలని ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక హార్డ్ కాపీలను ఇరు వర్గాలతో పంచుకోవాలని కోర్టు ఏఎస్ఐకి సూచించింది. డిసెంబర్ 19న ఏఎస్ఐ తన సర్వే రిపోర్ట�
Gyanvapi Case: జ్ఞానవాపి వివాదంలో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్ వ్యాజ్యాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు, యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సోమవారం వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదుపై తన సీల్డ్ సైంటిఫిక్ సర్వే నివేదికను సమర్పించింది. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు గత వారం ఏఎస్ఐకి కోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సర్వే నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ను ఆదేశించిన జిల్లా కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది.
కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞాన్వాపి మసీదు కార్బన్ డేటింగ్ను వారణాసి కోర్టు శుక్రవారం అనుమతించింది. జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో వివాదాస్పద 'శివలింగం' నిర్మాణాన్ని మినహాయించి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.