Gyanvapi Mosque: జ్ఞాన్వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad HC Allows Gyanvapi Mosque Survey: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సర్వేకు కోర్టు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి.. జూలై 21వ తేదీనే వారణాసి జిల్లా జడ్జి జ్ఞాన్వాపి ఏఎస్ఐ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి, మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని జడ్జి తెలపడంతో.. భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.
Buggana Rajendranath : ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పులపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
అయితే.. ముస్లిం కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆదేశించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. అప్పుడు సర్వే ఆగిపోయింది. సుప్రీం ఆదేశాల మేరకు ముస్లిం కమిటీ.. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జూలై 27న విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆగస్టు 3న తీర్పు వెలువడే దాకా సర్వే చేపట్టకూడదని పేర్కొంది. ఇప్పుడు తాజాగా విచారించిన హైకోర్టు.. మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, తక్షణమే సర్వే ప్రారంభించాలని ఏఎస్ఐకి అనుమతి ఇచ్చింది.
Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
ఇక కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ బృందం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయనుంది. అయితే.. శివలింగం కనుగొనబడిన ప్రదేశాన్ని, సీల్డ్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మాత్రం సర్వే చేయదు. ఈ సర్వేలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు న్యాయవాది విష్ణు జైన్ తెలిపారు. మసీదు సముదాయం లోపల మధ్య గోపురం క్రింద నేల నుండి చప్పుడు శబ్దం వస్తుందని హిందూ పక్షం పేర్కొంది. దాని కింద ఒక విగ్రహం ఉండవచ్చని, దానిని కృత్రిమ గోడతో కప్పి ఉండవచ్చని ఒక వాదన ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!