Gyanvapi Mosque: జ్ఞాన్వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad HC Allows Gyanvapi Mosque Survey: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సర్వేకు కోర్టు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి.. జూలై 21వ తేదీనే వారణాసి జిల్లా జడ్జి జ్ఞాన్వాపి ఏఎస్ఐ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి, మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని జడ్జి తెలపడంతో.. భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.
Buggana Rajendranath : ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పులపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారు
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అయితే.. ముస్లిం కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆదేశించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. అప్పుడు సర్వే ఆగిపోయింది. సుప్రీం ఆదేశాల మేరకు ముస్లిం కమిటీ.. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జూలై 27న విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆగస్టు 3న తీర్పు వెలువడే దాకా సర్వే చేపట్టకూడదని పేర్కొంది. ఇప్పుడు తాజాగా విచారించిన హైకోర్టు.. మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, తక్షణమే సర్వే ప్రారంభించాలని ఏఎస్ఐకి అనుమతి ఇచ్చింది.
Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
ఇక కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ బృందం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయనుంది. అయితే.. శివలింగం కనుగొనబడిన ప్రదేశాన్ని, సీల్డ్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మాత్రం సర్వే చేయదు. ఈ సర్వేలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు న్యాయవాది విష్ణు జైన్ తెలిపారు. మసీదు సముదాయం లోపల మధ్య గోపురం క్రింద నేల నుండి చప్పుడు శబ్దం వస్తుందని హిందూ పక్షం పేర్కొంది. దాని కింద ఒక విగ్రహం ఉండవచ్చని, దానిని కృత్రిమ గోడతో కప్పి ఉండవచ్చని ఒక వాదన ఉంది.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!