Gyanvapi Mosque: జ్ఞాన్వాపి మసీదు కేసులో కీలక మలుపు.. అందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad HC Allows Gyanvapi Mosque Survey: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. మసీదులో ఏఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) సర్వేకు కోర్టు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి.. జూలై 21వ తేదీనే వారణాసి జిల్లా జడ్జి జ్ఞాన్వాపి ఏఎస్ఐ సర్వేకు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి, మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని జడ్జి తెలపడంతో.. భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది.
Buggana Rajendranath : ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పులపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారు
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. చీఫ్ గెస్ట్లు వీరే!
అయితే.. ముస్లిం కమిటీ దీన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టును ఆదేశించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. అప్పుడు సర్వే ఆగిపోయింది. సుప్రీం ఆదేశాల మేరకు ముస్లిం కమిటీ.. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జూలై 27న విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆగస్టు 3న తీర్పు వెలువడే దాకా సర్వే చేపట్టకూడదని పేర్కొంది. ఇప్పుడు తాజాగా విచారించిన హైకోర్టు.. మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, తక్షణమే సర్వే ప్రారంభించాలని ఏఎస్ఐకి అనుమతి ఇచ్చింది.
Prostitution Racket: బయట మసాజ్.. లోపల పాడుపని.. ఇద్దరు మహిళలు అరెస్ట్
ఇక కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ బృందం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయనుంది. అయితే.. శివలింగం కనుగొనబడిన ప్రదేశాన్ని, సీల్డ్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మాత్రం సర్వే చేయదు. ఈ సర్వేలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు న్యాయవాది విష్ణు జైన్ తెలిపారు. మసీదు సముదాయం లోపల మధ్య గోపురం క్రింద నేల నుండి చప్పుడు శబ్దం వస్తుందని హిందూ పక్షం పేర్కొంది. దాని కింద ఒక విగ్రహం ఉండవచ్చని, దానిని కృత్రిమ గోడతో కప్పి ఉండవచ్చని ఒక వాదన ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..