ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను తాజాగా విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఇక ఇదిలా ఉండగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా…
South Coastal Zone: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మైలురాయిగా మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటయ్యింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ నిర్ణయంతో విశాఖపట్నం రైల్వే డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్తేర్ రైల్వే డివిజన్ను విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు,…
Robbery: గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన కలకలం రేపింది. పట్టణంలోని డీ మార్ట్కు కుటుంబ సభ్యులతో వచ్చిన ముత్యాల లక్ష్మి (55) అనే మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమె చేతి బ్యాగ్ను లాక్కుని పరారయ్యారు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు, రాంగ్ రూట్లో వాహనంపై వచ్చి బ్యాగ్ అపహరించి అక్కడినుంచి పారిపోయారు. బ్యాగ్లో రూ. 30 వేల నగదు…
గుంటూరులోని KL యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది.. యూనివర్సిటీ అధికారులు న్యాక్ (NAAC) అక్రిడేషన్ కోసం లంచాలు ఇచ్చిన ఘటనలో కేసు నమోదైంది. A++ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి లంచాలు ఇచ్చినట్లు సీబీఐ తేల్చింది. వర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ తో పాటు మొత్తం10మంది అరెస్ట్ చేసింది.. విశాఖ, ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు విజయవాడలోని కేఎల్యూ పరిపాలనా భవనం, వడ్డేశ్వరంలోని క్యాంపస్లో సోదాలు చేపట్టారు. నిన్న రాత్రి 10 గంటల…
గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో…
ఎల్లుండి గుంటూరుతో పాటు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.. శనివారం గుంటూరు, కడప జిల్లాల్లో సీఎం పర్యటన ఖరారు అయ్యింది.. ఉదయం గుంటూరు జిల్లా పర్యటనలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. అనంతరం వేస్టు టూ ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు.. ఆ తర్వాత కడప జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు..
సంక్రాంతి పండగ వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకపక్క పోలీసుల దాడులు కొనసాగుతున్నా.. మరొక పందెం నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట నిర్వహణకు సైతం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి…
గుంటూరులో నివాసం ఉండే షేక్ మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు గ్రామం. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది.
Murder Case: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో శుక్రవారం 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు డిఎస్పీ టి.మురళీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసు 2020 డిసెంబరులో గ్రామంలోని రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించింది. గ్రామంలో ఒక వీధి ప్రారంభంలో కొత్తగా నిర్మించిన ఆర్చీకి పేరు నిర్ణయించే క్రమంలో రెండు వర్గాలు ఆందోళనకు…