సార్వత్రిక ఎన్నికలకు ముందు మణిపూర్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామంలో కుకీ, మోతీ సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కము సైచాంగ్ గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్ర గాయల పాలయ్యాడు.
అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. తాజాగా, యూఎస్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు.
నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్ భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు నవోమి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో కారుపై దాడి చేయడాన్ని చూసి.. నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు షార్ప్ షూటర్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన ముష్కరులలో దీపాంశు అలియాస్ మోను, మొయినుద్దీన్ అలియాస్ సల్మాన్ ఉన్నారు. వీరిద్దరూ సల్మాన్ త్యాగి గ్యాంగ్కు చెందినవారు కాగా.. సల్మాన్ త్యాగికి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో సంబంధం ఉంది.
యునైటెడ్ స్టేట్స్లోని డెన్వర్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికన్ సింగర్ డైర్క్స్ బెంట్లీ అనే బార్లోకి తనను అనుమతించకపోవడంతో ఐదుగురిని కాల్చి చంపింది ఓ మహిళ. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు డెన్వర్ పోలీసులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టిచింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్లో తుపాకుల మోత మోగడంతో.. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు.