Assam-Arunachal border: అస్సాం-అరుణాచల్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రంజన్ భుయాన్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థానిక ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాని సన్నాహాలకు సంబంధించి ఉదయం ఏడుగురు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అప్పుడే నిందితులు కాల్పులు ప్రారంభించారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also:Payal rajputh : ఏంటి పాప.. కింద ప్యాంట్ మర్చిపోయావా..
Also Read
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
మరో ముగ్గురు గల్లంతయ్యారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకున్న మా బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కొందరి ప్రమేయం ఉందని స్థానిక ప్రజలు ఆరోపించారు. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ 804-కిమీల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయి.
Read Also:Ashok Gehlot on Modi: మోదీ మొండితనం వల్లే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: అశోక్ గెహ్లాట్
ఏప్రిల్ 20 న న్యూఢిల్లీలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ , అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సరిహద్దు రేఖను పరిష్కరించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలకు ఊతం ఇచ్చేందుకు గతేడాది జూలైలో ఇద్దరు ముఖ్యమంత్రులు నంసాయి డిక్లరేషన్పై సంతకాలు చేశారు. 1972లో అరుణాచల్ప్రదేశ్కు కేంద్ర పాలిత ప్రాంతంగా, 1987లో రాష్ట్ర హోదా లభించింది.
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..