Assam-Arunachal border: అస్సాం-అరుణాచల్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam-Arunachal border: అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. పోలీసులు ఈ సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రంజన్ భుయాన్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థానిక ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాని సన్నాహాలకు సంబంధించి ఉదయం ఏడుగురు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అప్పుడే నిందితులు కాల్పులు ప్రారంభించారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also:Payal rajputh : ఏంటి పాప.. కింద ప్యాంట్ మర్చిపోయావా..
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
మరో ముగ్గురు గల్లంతయ్యారని, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ తెలిపారు. సమాచారం అందుకున్న మా బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం ఉన్నందున అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కొందరి ప్రమేయం ఉందని స్థానిక ప్రజలు ఆరోపించారు. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ 804-కిమీల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయి.
Read Also:Ashok Gehlot on Modi: మోదీ మొండితనం వల్లే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: అశోక్ గెహ్లాట్
ఏప్రిల్ 20 న న్యూఢిల్లీలో, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ , అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సరిహద్దు రేఖను పరిష్కరించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ప్రయత్నాలకు ఊతం ఇచ్చేందుకు గతేడాది జూలైలో ఇద్దరు ముఖ్యమంత్రులు నంసాయి డిక్లరేషన్పై సంతకాలు చేశారు. 1972లో అరుణాచల్ప్రదేశ్కు కేంద్ర పాలిత ప్రాంతంగా, 1987లో రాష్ట్ర హోదా లభించింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!